హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా
విలీనమై ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు.. ఇందుకు కారణం ఎవరో
తెలుసా?.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్..
స్వతంత్ర భారత దేశ తొలి హోంమంత్రిగా బాధ్యతలు
చేపట్టిన సర్ధార్ పటేల్, ముందుగా స్వదేశీ సంస్థానాలపై దృష్టి సారించారు.. బ్రిటిష్
వారు పోతూ పోతూ మెలిక పెట్టి పోయారు.. సంస్థానాలు భారత్, పాకిస్తాన్ ఎందులైనా
విలీనం కావచ్చట.. లేదా స్వతంత్రంగా ఉండొచ్చట.. ఇది దేశ సమగ్రతకు మప్పు అని
గ్రహించారు పటేల్.. ఐదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేయడలో విజయం
సాధించారు.. ఈ క్రమంలో మొండి కేసిన హైదరాబాద్, జునాగడ్ లను సైనిక చర్య ద్వారా
దారికి తెచ్చారు..
సర్ధార్ వల్లభాయ్ చేసిన ఈ మహత్తర కృషి
కారణంగా పాత హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, హై.కర్ణాటక ప్రజలు భారత
దేశంలో భాగమయ్యారు.. తోటి భారత ప్రజలతో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం అనుభవిస్తున్నారు..
దురదృష్టవశాత్తు హైదరాబాద్ నగరంలో లో సర్దార్
పటేల్ గారిని మరచిపోయే పరిస్థితి ఏర్పడింది.. తెలంగాణ వాదులు అసెంబ్లీ ముందు అమర
వీరుల స్థూపాకిని నివాళులు అర్పిస్తున్నారు.. కానీ దాని ముందే ఉన్న పటేల్
విగ్రహాన్ని మరచిపోతున్నారు.. అసలు భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం భాగం కాకపోయి
ఉంటే పరిణామాలు ఎలా ఉండేవి.. ఈ రోజున తెలంగాణకు అస్థిత్వం, ప్రత్యేక రాష్ట్రం
సిద్దించిందంటే మూల కారకులు ఎవరు?
తెలంగాణ (హైదరాబాద్) విముక్తికి కారకులైన
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను 17 సెప్టెంబర్ సందర్భంగా స్మరించుకుందాం..
No comments:
Post a Comment