Tuesday, September 9, 2014

మహా మనిషి కాళన్న..

నిజాం నిరంకుశ పాలనను నిరసించాడు.. అక్షరాయుధాలతో తిరగబడి జైలుకెళ్లాడు.. ఆయన అందరి వాడు.. ఆర్యసమాజం, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో సహా అందరినీ ఆదరించాడు.. గొప్ప ప్రజాస్వామ్య వాది.. ఆయన గొప్ప మానవతా వాది.. వ్యక్తిగత స్వేచ్ఛను గట్టిగా బలపరిచాడు.. ఎన్నికల్లో ఓటేసే వారిని చంపేస్తాం అని తీవ్రవాదులు బెదిరిస్తే, ఏదీ చంపండి చూద్దాం అని అందరికన్నా ముందు వెళ్లి ఓటేశాడు.. జనం గొడవే ఆయన గోస..
పుట్టింది మరాఠీ కుటుంబంలో.. కానీ తెలుగు భాషను ప్రేమించాడు.. మహాకవిగా మారాడు.. రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాష ఎట్లయితది అని ఎదిరించాడు.. తెలంగాణ యాసకు గుర్తింపు తెచ్చాడు.. తెలుగు వారి ఐక్యత కోసం విశాలాంధ్రను స్వాగతించాడు.. ఆ తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కాంక్షించాడు.. తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? అని ప్రశ్నించాడు..
ఆయనే కాళోజీ నారాయణ రావు..

పుట్టుకు నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నింగికేగినప్పుడు వ్యాఖ్యానించాడు కాళోజీ.. అయితే ఇది కాళోజీ జీవితానికి కూడా చక్కగా వర్తిస్తుంది.. చివరి వరకూ ప్రజల మనిషిగానే బతికాడు.. ఆయన జీవితం తెరచి ఉంచిన పుస్తకం.. మహామనిషి కాళోజీ నారాయణ రావును ఆయన శత జయంతి సందర్భంగా యాది తెచ్చుకుందాం..

No comments:

Post a Comment