Friday, September 12, 2014

భారత్ లోనే కాశ్మీర్ కు భద్రత

అందాల కాశ్మీరాన్ని ఊహించని వరదలు అల్లకల్లోలం చేశాయి.. శ్రీనగర్ సహా చాలా పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి.. ఇళ్లూ, ఆస్తులు పోయాయి.. వందలాది మంది మృత్యవాత పడ్డారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయమిది..
బాధితులను ఆదుకోవడంలో భారత ప్రభుత్వం చురుగ్గా స్పందించింది.. రంగంలోకి దిగిన సైన్యం వేలాది మందిని రక్షించింది.. మన జవాన్లు ప్రాణాలకు తెగించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు.. కాశ్మీరీ ప్రజలు సైన్యం చేసిన సేవలను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి..
కాశ్మీర్లో వేర్పాటు వాదులు అర్థం లేని పోరాటంతో అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. కాశ్మీర్ స్వతంత్రంగా ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏం జరిగేది.. పాకిస్తాన్లో కూడా వరదలు వచ్చాయి.. కానీ ప్రభుత్వం, సైన్యం బాధితులను పెద్దగా ఆదుకోలేకపోతున్నాయి.. మరి కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటే ఎలా ఉండేది? పరిస్థితులను ఊహించండి.. భారత ప్రభుత్వం కాశ్మీర్లో మౌళిక సదుపాయాల కోసం, ప్రజల ఉపాధి, విద్య, సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది.. అయినా ఉగ్రవాదులు పాకిస్తాన్ సహకారంతో భారత్ ను నిందిస్తూ అక్కడి నవతరం యువకుల్లో వేర్పాటు వాదాన్ని నూరిపోస్తున్నారు.. కాశ్మీర్లో వరద బాధితులను ఆదుకోవడానికి భారత్ నుండి పెద్ద సంఖ్యలు స్వచ్ఛంద సంస్థలు తరలివెళ్లాయి.. మరి ఏ ఉగ్రవాద సంస్థ అయినా అక్కడి ప్రజలను ఆదుకున్న సందర్భాన్ని గమనించారా?..  భారత దేశంలో భాగంగా ఉంటేనే కాశ్మీర్ కు మనుగడ ఉంటుందనే స్పష్టం అవుతోంది..



No comments:

Post a Comment