Sunday, September 14, 2014


కనీవినీ ఎరుగుని రీతిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.. దాదాపు 300 వందల మందికి పైగా చనిపోయారు.. ఆరు లక్షల మంది సర్వస్వం వరదల్లో కోల్పోయారు. సైన్యం లక్షా 10 వేల మందికి రక్షించింది.. ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చు.. వరదల కారణంగా ఇళ్లూ ఆస్తులు దెబ్బతిన్నాయి.. రోడ్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతిన్నిది.. సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నివాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..  ఇందు కోసం జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్, హైదరాబాద్ ఛాప్టర్ సేవా భారతి, తెలంగాణ శాఖలు చేపట్టిన సహాయక కార్యక్రమాలకు తమ వంతు చేయూతనివ్వండి..
వందలాది మంది సేవాభారతి కార్యకర్తలు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాత్రింబవళ్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.. మీరు అందించే ప్రతి వస్తువు, ప్రతి పైసా నూటికి నూరు శాతం సద్వినియోగం అవుతుందని పూచీ ఇచ్చేందుకు దేశంలో పలు ప్రకృతి బీభత్స సమయాల్లో సేవా భారతి చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనం.. మీరు అందించే విరాళాలకు 80G ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది..
మీ సహాయాన్ని నేరుగా Seva Bharathi, A/C: 630501065297,  ICICI Bank, IFSC Code ICIC0006305, Himayatnagar Branch, Hyderabad కి జమ చేయవచ్చు.. రసీదు అందించడానికి మీ పూర్తి పేరు, చిరునామా ఇవ్వడం మరచిపోకండి.. మీ  చెక్కులను నేరుగా Sevabharathi, 3-2-106, Nimboliadda,Kachiguda, Hyderabad 500027 చిరునామాకు కూడా పంపవచ్చు..

ఇతర వివరాలకు జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షులు ప్రొఫెసట్ టి. తిరుపతి రావు (ఉస్మానియా విశ్వ విద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్) లేదా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి.కె. ప్రసాద్, మొబైల్ నెంబర్: 98496 13445 సంప్రదించవచ్చు..

No comments:

Post a Comment