Tuesday, September 16, 2014

ఫలితాలపై నిరాశ వద్దు..

అయిపోయింది.. ఇంకెక్కడి మోదీ.. ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి..దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తునే ఓ మిత్రుడు గావు కేక పెట్టేశాడు..
ఎన్నికల ఫలితాలు ఆలోచించ తగినవే.. రాజస్థాన్, యూపీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే.. కానీ కంగారు పడిపోవాల్సినవేమీ కాదు.. సాధారణ ఎన్నికల్లో దేశ ప్రజలంతా మార్పు కోరుకున్నారు.. నరేంద్ర మోదీ ప్రత్యామ్నాయంగా కనిపించారు.. మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించినవే.. ఆ విషయాన్ని మోదీయే స్వయంగా చెప్పేశారు..
ఈ ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కొత్త అధ్యక్షుడు అమిత్ షా ప్రచారానికి పోలేదు.. స్థానిక నాయకత్వానికే బాధ్యతలు వదిలేశారు.. నిజానికి వీరు వెళ్లాల్సిన అవసరమే లేదు.. గత ఎన్నికల్లో దెబ్బతిన్న సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు కసిగా పని చేశాయి.. వారికి చావు బతుకుల సమస్య కదా.. అదే సమయంలో బీజేపీ నాయకుల్లో మితి మీరిన ఆత్మ విశ్వాసం వచ్చేసింది.. అది కాస్త కొంప ముంచింది.. ఈ అంశంపై భాజపా శ్రేణులు దృష్టి పెడితే మంచిది..

బీజేపీకి ఏ మాత్రం బలం లేని పశ్చిమ బెంగాల్, అసోంలలో వచ్చిన ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి.. రాబోయే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు బీజేపీకీ అత్యంత కీలకం కానున్నాయి..  

No comments:

Post a Comment