Saturday, September 27, 2014

ఇవాళ జయమ్మ.. మరి రేపు?

చేసుకున్నవారికి చేసుకున్నఅంటారు.. జయమ్మ కథ కూడా ఇంతే..
సమాజమే దేవలం అయితే సామాన్యుడే దేవుడు.. ప్రజాస్వామ్య ఆలయంలో దేవుళ్లయిన ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తగా ఉండాలి.. మరి ధర్మకర్తే ధర్మం తప్పితే.. అందుకు మూల్యం చెల్లించక తప్పదు జయలలిత మాదిరిగా..

జయలలిత తమిళనాట తిరుగులేని ప్రజాధరణ ఉన్న నాయకురాలు.. ఇందులో అనుమానం లేదు.. అభిమానులు ఆమెను పురచ్చి తలైవిగా కొలుస్తారు.. వారి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిన జయ, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు వినూత్న పథకాలు ప్రారంభించారు.. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు మొదలుకొని నిన్న అమ్మ సిమెంట్ కూడా వచ్చేంది.. కానీ ఇన్ని చేసినా గతంలో చేసిన పాపం వెంటాడుతూనే ఉండి.. చివరకు ప్రజాక్షేత్రానికి పదేళ్ల పాటు దూరంగా ఉండాల్సిన కర్మ పట్టింది.. అక్రమ ఆస్తుల కేసు విచారణ 18 ఏళ్ల పాటు కోర్టుల్లో కొనసాగింది.. చివరకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా పడింది.. ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేసింది..
మంచి పనులు చేసి ప్రజాభిమానం సంపాదించ వచ్చు గాక.. కానీ ఈ ముసుగులో శిక్షను తప్పించుకోజాలరు.. ఇది తమిళనాడు మాత్రమే కాదు, యావద్దేశానికీ, తెలుగు రాష్ట్రాలకూ వర్తిస్తుంది.. ఇవాళ జయలలిత జైలుకు వెళ్లింది.. అంత మాత్రాన కరుణానిధి పవిత్రడైపోరు.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను, పార్టీ నాయకులను ఎన్నో కేసులు వెంటాడుతున్నాయి.. ఇత మన రాష్ట్రం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
మొత్తానికి జయలలిత ఎపిసోడ్ రాజకీయ నాయకులందరికీ గుణపాఠం కావాలి..

No comments:

Post a Comment