Saturday, September 20, 2014

ఇప్పడు వీడి వంతు..

కాశ్మీర్ అంతా పాకిస్తాన్ దే నంట.. ఓ పిల్ల కాకి గోల పెట్టింది.. భారత్ నుండి కాశ్మీర్ అంతా లాక్కుంటాడట.. ఒక్క ఈంచీ కూడా వదలడట.. పాకిస్తాన్ పీపుల్ పార్టీ భవిష్య నాయకుడు, బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో పేలాపన ఇది..
గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేసిన వీడి తాత జూల్ఫీకర్ అలీ భుట్టో, అమ్మ బెనజీర్ భుట్టో ఇలాగే వాగారు.. కొత్తగా ఈ పిల్లకాకీ అదే పాచిపాట అందుకుంది..
భారత్ నుండి కాశ్మీర్ను ఎవరూ వేరు చేయలేరు.. బిలావల్ జేజమ్మలు దిగొచ్చినా పీకేదేమీ లేదు.. కాశ్మీర్ సంగతి దేవుడెరుగు ముందు బిలావల్కు సొంత దేశం పాకిస్తాన్లో రక్షణ ఉందా అసలు?
వీడి తాతను సైన్యం ఉరి చంపేసింది.. అమ్మను ఉగ్రవాదులు చంపేశారు.. వీడి నాన్న మిస్టర్ టెన్ పర్సెంట్ అదేనంవడి పాక్ అధ్యక్షునిగా పని చేసిన అసిఫ్ అలీ జర్దారీకి అరెస్టు భయం ఉంది.. మీ దేశంలో మీ ప్రాణాలు కాపాడుకోండి ముందు..బతికుంటే పొరుగు దేశం గురుంచి తీరిగ్గా ఆలోచించొచ్చు..

No comments:

Post a Comment