Saturday, September 20, 2014

చైనాతో జాగ్రత అవసరం..

వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీ ఉండాలంటారు.. శత్రువు ముందు డీలాగా కనిపిస్తే శాశ్వతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు.. మనం ధృడంగా ఉంటే అతడే కాస్త దిగొస్తాడు..
భారత్, ఛైనాల మధ్య ప్రాచీన కాలంగా సాంస్కృతిక సంబంధాలు ఉండేవి.. విదేశీయుల పాలనలో అంతరం ఈ సంబంధాల మధ్య అంతరం పెరిగింది.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం చేసిన తప్పుల్లో టిబెట్ పట్ల మన విధానంలో మార్పు.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ టిబెట్ నుండి మన రక్షణ దళాలను తొలగించారు.. ఆ తర్వాత చైనాలో మావో నేతృత్వంలో వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్ ను కబలించింది.. నెహ్రూజీ దీన్ని ఖండించకపోగా స్వాగతించి చారిత్రిక తప్పిదానికి పాల్పడ్డారు.. టిబెట్ ను చైనాలో అంతర్భాగంగా గుర్తించిన తొలి దేశం భారతే.. పైగా హిందీ, చీనీ భాయి భాయి.. పంచశీల అంటూ చైనాలో అంటకాగారు.. అదే సమయంలో టిబెట్ అధిపతి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు శాంతి దూతలా ఫోజు ఇచ్చారు..
మన బలహీనతలను కనిపెట్టిన చైనా దొంగ దెబ్బ తీసింది.. 1962లో ఛైనా మన దేశంపై దురాక్రమణకు దిగడంతో ప్రపంచం ముందు పరువు పోయింది.. ఈ వ్యధతోనే నెహ్రూగారు పోయారంటారు.. ఆక్రమిత కాశ్మీర్ లోని అక్సాయ్ చిక్ ప్రాంతం చైనా కబ్జాలోకి పోయినా మన గట్టిగా ప్రతిఘటించలేకపోయాం.. లద్దాక్ లో చొరబాట్లతో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మనతో తరచూ ఘర్షణలకు దిగుతున్నా గట్టిగా వ్యతిరేకించలేకపోతున్నాం.. చైనాతో యుద్దం తర్వాత దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య మూసుకుపోయిన సంబంధాల ద్వారాలు, రాజీవ్ గాంధీ హయాంలో తిరిగి తెరుచుకున్నాయి.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినా, చైనా సంఘర్షణాత్మక వైఖరికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం..

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటనకు వచ్చారు.. చైనా అధ్యక్షుడు భారత్ లోకి వస్తున్న సమయంలో మళ్లీ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.. సరిహద్దు వివాదాలు కూడా చర్చకు వచ్చాయి.. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఘననీయంగా మార్పు వచ్చింది.. గతంలో మాదిరిగా భారత్ లో బలహీన మనస్కులు పాలకులుగా లేరు.. ఇరు దేశాల మధ్య ఇచ్చి పుచ్చుకునే వరకూ ఓకే.. మన ప్రధాని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు.. అదీ ఒక సమవుజ్జీగా.. కానీ ఎంతైనా శత్రువుతో జాగ్రత్తగా ఉండటం అవసరం..

No comments:

Post a Comment