Thursday, September 25, 2014

దీన్ దయాళ్జీని స్మరించుకుందాం..


వ్యక్తుల జీవితం మరణంతోనే అంతం.. కానీ మహనీయులు భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో చిరస్తాయిగా జీవించే ఉంటారు..
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ కోవకు చెందిన వారే.. భారతీయ జనసంఘ్ ద్వితీయ అధ్యక్షులు దీన్ దయాళ్జీ జీవితం అందరికీ ఆదర్శప్రాయం.. ప్రతి శ్వాసలోనూ దేశ సేవ కోసమే అన్నట్లుగా పని చేసిన మహనీయుడాయన.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా దేశ సేవను ఆరభించారు.. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడైన దీన్ దయాళ్ జీ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ తర్వాత అధ్యక్షునిగా పని చేశారు.. ఏకాత్మతా మానవతావాద సిద్దాంతాన్ని సమాజానికి అందించారు.. ఎదిగిన కొద్దీ ఎలా ఒదిగి ఉండాల్లో ఆచరించి చూపించారు.. నిరాడంబరంగా జీవించారు.. చిన్న వయసులోనే హత్యకు గురయ్యారు.. దీన్ దయాళ్జీ జీవించి ఉంటే భారత రాజకీయ పటం మరోలా ఉండేది..
పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నేడు..ఆ మహనీయున్ని స్మరించుకుందాం..

No comments:

Post a Comment