Thursday, August 30, 2012

దాడి గారి విజ్ఞత

కసబ్ ను కాదు సీఎంను ఉరి తీయాలంటున్నారు టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు.. అంటే ముంబయ్ మారణ హోమానికి కారకుడైన కసబ్ కు బదులుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఉరి తీయాలంటున్నారన్న మాట.. రాజకీయాల్లో విలువలు, హుందాతనం ఏ విధంగా దిగజారిపోతున్నాయో చెప్పేందుకు శాసస మండలి విపక్ష నేత, మాజీ మంత్రి దాడి చేసిన ఈ వ్యాఖ్యలే ఉదాహరణ.. ఫీజు రీఎంబర్స్ విషయంలో విఫలమైన నేరానికి ఏకంగా ముఖ్యమంత్రిని ఉరి తీయాలంటున్న వీరభద్రరావు విజ్ఞత మనకు ఇక్కడ ప్రస్తుతానికి అనవసరం.. కానీ కబస్ ను ఉరి తీయొద్దనే అధికారం దాడిగారికి ఎక్కడిది? ఆయన ఏమైనా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధా?

No comments:

Post a Comment