Sunday, August 5, 2012

జైపాల్ కాదు అసమర్థ పాల్

యూపీఏ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, మన్మోహన్ ఓ ధృతరాష్ట్ర చక్రవర్తి అని నేను భావిస్తూ వచ్చాను.. కానీ ఈ ప్రభుత్వంలో అంతకన్నా పనికి రాని వారున్నారని, అందులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి గారు ప్రథముడని చెప్పక తప్పదు.. కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఏపీలోని విద్యుత్తు ప్రాజెక్టుల అవసరాలను ఏమాత్రం తీర్చకుండా సరిహద్దులు దాటి మహారాష్ట్రకు తరలించాలని సొంత శాఖలో నిర్ణయించినా తనకేమీ సంబంధం లేదని బుఖాయించిన ఘనత జైపాలునిది.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న ఏమీ చేయలేని అసమర్థ మంత్రిగా దేశ ప్రజలచే కీర్తించబడ్డ రెడ్డి గారు, ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజల ఛీత్కారాలు చవి చూస్తున్నారు.. స్వంత రాష్ట్రానికే ఏమీ చేయలేని జైపాల్ రెడ్డి గారికి అజాగళ స్థనం లాంటి కేంద్ర మంత్రి పదవి ఉంటే ఎంత? పోతే ఎంత? ఒకప్పడు జైపాల్ రెడ్డిని ఎంతో అభిమానించిన నేను అంతటి సీనియర్ నాయకుడు ఇంత వరకూ ముఖ్యమంత్రి ఎందుకు కాలేక పోయారా అని బాధ పడే వాన్ని.. ఇప్పడు ఇలాంటి అసమర్ధ నాయకుడు సీఎం కాకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను..

No comments:

Post a Comment