Wednesday, August 29, 2012

సరైన శిక్ష

ముంబయ్ మారణ హోమంలో పాల్గొన్ని పట్టుబడ్డ అజ్మల్ కసబ్ కు సుప్రీం కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడం దేశ ప్రజలందరికీ ఊరట కల్గించే విషయం.. 2008 నవంబర్ 26న జరిగిన ఈ సంఘటనలో 166 మంది భారతీయులు, విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు.. భారత దేశంపై దాడికి దిగిన ఈ పాకిస్తానీకి ఈ శిక్షకూడా తక్కువే. ఇప్పటికే కసబ్ రక్షణ కోసం, తిండి తిప్పల కోసం 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చైపోయాయి.. ఇదంతా భారతీయులు కష్టార్జితంతో కట్టిన పన్నుల సొమ్ము.. ప్రభుత్వం తక్షణం ఇతగాన్ని ఉరి తీయాలి.. లేకపోతే అఫ్జల్ గురు తరహాలో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొని మరి కొన్నేళ్లు భారతీయ జైళ్లలో ఆతిధ్య స్వీకరిస్తాడు.. పార్లమెంట్ పై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురుకు ఉరి శిక్ష పడ్డా క్షమాభిక్ష పేరిట ఆడుతున్న నాటకాలు తెలిసిందే.. కొన్ని సంస్థలు ఉరి శిక్షను రద్దు చేయాలనే ముసుగులో ఇలాంటి రక్తం రుచి మరిగిన నరహంతకులను కాపాడే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ద్రోహులను ఇంటి అల్లుళ్ల మాదిరిగా మేపుతోంది..

No comments:

Post a Comment