Friday, August 17, 2012

స్వదేశంలో అనాధలు..

మీ ఇంటిలో అక్రమంగా తిష్టవేసిన పొరుగూరి వాడు మిమ్మల్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది?.. పక్కింటివాడు సైతం తిష్టేసినోడికి అండగా నిలిస్తే?.. ఇదేమీ పట్టించుకోని సర్పంచు సంయమనం పాటించాలంటూ సన్నాయి నొక్కలు నొక్కితే మీ పరిస్థతి ఏమిటి?.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ సమస్యను ఈ కోణంలో ఆలోచించి చూడండి? ఎవరిది న్యాయం? ఎవరిది అన్యాయం?

విదేశీ చొరబాట్ల సమస్య మన దేశంలొ వివిధ ప్రాంతాల్లో పని చేసుకొని బతుకుతున్న అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల అమాయక పౌరులకు సైతం శాపంగా మారింది.. కొందరు దుండగుల బెదిరింపుల ఫలితంగా ఏ పాపం తెలియని ఈ స్వదేశీ పౌరులు భయపడిపోతున్నారు.. బెంగళూరు, హైదరాబాద్ నుండి ఇప్పటికే వేలాది మంది అస్సాం, ఈశాన్య రాష్ట్రాల వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు.. కేంద్రం, కర్ణాటక-ఆంధ్ర ప్రభుత్వాలు ఆలస్యంగా నిద్ర లేచి భయపడొద్దు, రక్షణ కల్పిస్తామంటూ హిత వచనాలు పలుకుతున్నాయి..
అస్సాంలో దశాబ్దాలుగా చొరబడుతూ వచ్చిన వారికి, స్థానికులకు పెద్ద ఎత్తున్న ఘర్షణలు జరుగుతున్నాయి.. ఇది విదేశీయులకు, స్వదేశీయులకు జరుగుతున్న పోరని మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పగలరు?.. దురదృష్టవశాత్తు ఈ సమస్యకు మతం రంగు పులిమేశారు.. ఇందుకు కారణం దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీ ఓటు బ్యాంకుపై మోజుతో మొదటి నుండీ ఈ సమస్యను పట్టించుకోలేదు.. ఇప్పడు వ్యవహారం ముదిరిపాకాన పడింది.. భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక గుడ్లు తేలేస్తున్నాయి.. పాముకు పాలు పోసి పెంచితే కాటేయకుండా ఉంటుందా?.. రోగం ముదిరాక ఏ మందు వేసినా ఫలితం ఏముంటుంది?

No comments:

Post a Comment