Tuesday, August 14, 2012

విశాద దినం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మువ్వన్నెల జెండా గురేస్తాం.. కానీ చరిత్రలో దారుణమైన విశాద సంఘటనను మరచిపోతున్నాం.. అదే దేశ విభజన.. తెల్లవారితే స్వాతంత్ర్యం అనగా 1947 ఆగస్టు 14 నాడు దేశం మూడు ముక్కలైంది.. తూర్పు, పశ్చిమ ముక్కలు పాకిస్తాన్ గా ఆవిర్భవించాయి.. ప్రధాన భూభాగం ఇండియాగా మిగిలిపోయింది.. కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.. కానీ ఈ పాపంతో ఏ మాత్రం సంబంధం లేని మూడో వంతు భారతీయులు రాత్రికి రాత్రే పరాయి వారయ్యారు.. సరిహద్దులకు రెండు వైపులా దారుణమైన ఊచకోత జరిగింది.. ఎందరో నిర్భాగ్యులు మాన ప్రాణాలు కోల్పోయారు.. లక్షలాది మంది ప్రజలు కట్టు బట్టలతో వలస వచ్చారు.. చరిత్రలో ఎంతో విశాద దినం అది.. ఇప్పడు చెప్పండి ఇది సంబరాలు జరుపుకునే దినమా?
1857కు ముందు నుండీ మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు ప్రాణ త్యాగం చేశారు.. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్ లాంటి విప్లవ వీరులు ప్రాణాలు బలిపెట్టారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి దేశం వెలుపలి నుండి పోరాడారు.. వీరంతా కోరుకున్న దేశ విభజన కాదు.. నాటి కాంగ్రెస్ నాయకులు తమ జీవిత చరమాంకంలో అయినా అధికారం అనుభవించాలనే తాపత్రయంతో దేశ విభజనకు అంగీకరించారు.. అమాయక ప్రజల రక్త తర్పణంతో జవహర్ లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నాలకు అధికారం పంచుకున్నారు.. స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ అలాంటి సమయంలో దేశ విభజన తాలూకు విశాద గాయాలనూ తడుముకుందాం.. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకుందాం..
జై హింద్..

No comments:

Post a Comment