Saturday, August 11, 2012

మన జాతీయ పానీయం

కాశ్మీరు నుండి తమిళనాడు దాకా, అరుణాచల్ నుండి గుజరాత్ వరకూ.. భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, కులాలు, తెగలు ఉన్న దేశం మనది.. ఆచారాలు, ఆహార్యాలు, వేశ భాషలు, రుచులు, అభిరుచులు వేరు కావచ్చు.. కానీ భారతీయులందరినీ కలిపేది ఒక్కటే.. అదే ఛాయ్.. టీ అనండి లేదా తేనీరనండి.. ఈస్టిండియా కంపెనీ వాడు మన దేశ ప్రజలకు అలవాటు చేస్తే చేసుండొచ్చు గాక.. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే దాకా కనీసం ఒక్క కప్పు ఛాయ్ తగని వాడు భారతీయుడే కాదని నా అభిప్రాయం (కాఫీ ప్రియులారా క్షమించండి).. పక్కా హైదరాబాదీనైన నేను రోజుకు మూడు కప్పులైనా తాగలేకుండా ఉండలేను.. పురాణాల్లో మన దేవతలు, మునులు తాగిన సోమరసం పక్కా టీ అయ్యుంటుందని నా అభిప్రాయం.. ఇంటికి వచ్చిన అతిధులకు కచ్చితంగా తేనీరు ఆఫర్ చేయడం భారతీయ సాంప్రదాయంగా మారింది.. పేద, ధనిక తారతమ్యాలతో సంబంధం లేకుండా 99 శాతం మంది దేశ ప్రజలు తాగే తేనీటికి జాతీయ పానీయంగా ప్రకటించాలని ప్రతిపాదించినందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ధన్యవాదాలు.. జాతీయ ఆహారం ఏమిటని మాత్రం అడగకండి.. మళ్లీ మనలో మనకు విబేధాలు రావచ్చు.. అయితే బిస్కట్ విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు..(మనలో మాట మన హైదరాబాదీలు దేశంలోనే అత్యధిక స్థాయిలో మద్యం సేవిస్తారట.. టీకి ఎక్కడ పోటీగా వస్తారోనని భయంగా ఉంది..)

No comments:

Post a Comment