Tuesday, August 7, 2012

మన ఎంపీలు అసమర్థులోయ్

కన్యాశుల్కం గిరీషం నిజంగా ఉన్నుంటే మన ఎంపీలు అసమర్థులోయ్ వెంకటేషూ.. అనేవాడు. ఇంత మంద ఉండి ఏం లాభం.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం చేతకాదు.. బెంగాలీలు, తమిళులకు ఉన్న పాటి ప్రాంతీయ అభిమానం లేదు.. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు.. మన రాష్ట్రం మరాఠీలు నుండి గ్యాసు తన్నుకు పోతే కేంద్రాన్ని నిలదీసే బదులు దేబిరిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుండి ప్రాతి నిధ్యం వహిస్తున్న మంత్రులు మొద్దు నిద్ర పోతున్నారో?, నటిస్తున్నారో అర్థం కాదు.. కేంద్ర పెట్రోలియం మంత్రి గారు తెలుగు వాడని చెప్పుకోవడానికి మనం సిగ్గు పడక తప్పదు.. యూపీఏ ప్రభుత్వ మనుగడకు ఏపీ నుండి ఎన్నికైన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలే ఆయువు పట్టు.. సోనియా భజనలో ఉన్నంత శ్రద్ధలో కనీసం పదో వంతైనా రాష్ట్ర ప్రయోజనాలపై ఉంటే మెడలు వంచి సాధించుకునే వారం.. ఇలాంటి అసమర్థ ఎంపీలను తిరిగి ఎన్నుకోకపోవడమే సరైన శిక్ష..

No comments:

Post a Comment