Thursday, August 2, 2012

చందనా ఖాన్ తప్పేమీ చెప్పలేదు

సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఎందుకంత వివాదాస్పదం చేస్తున్నారో అర్థం కావడం లేదు.. పాఠశాల్లో మరుగుదొడ్లను కడిగించడం ద్వారా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదనే సందేశాన్ని అందించవచ్చు.. మరుగు దొడ్లు కడగటం శ్రమదానంగా ఎందుకు భావించరాదు? పాకీ పనివారో, ఆయాలు మాత్రమే ఈ పని చేయాలని భావించడం సరికాదు.. ఆ మాటకు వస్తే మహాత్మా గాంధీజీ స్వయంగా మరుగు దొడ్లు కడిగారు.. విద్యార్థుల్లో సేవా భావం పెరుగుతుంది.. పని లేని మీడియా ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేసింది.. చందనా ఖాన్ తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు..

No comments:

Post a Comment