Saturday, August 25, 2012

టీటీడీపై రాజకీయ పెత్తనమేలా?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొత్త ఛైర్మన్ ఎవరు అనే ఊహాగానాలు మొదలయ్యాయి.. ఈ పదవిని తిరిగి దక్కించుకోవడానికి ప్రస్తుత ఛైర్మన్తో పాటు పా ఛైర్మన్లు సైతం పోటీ పడుతున్నారు.. వీరంతా రాజకీయ నాయకులే.. ఓ బడా కాంట్రాక్టర్ తన సతీమణి పేరు ప్రతిపాదిస్తే, మరో మద్యం వ్యాపారి తన కోసం పావులు కదుపుతున్నాడు.. మరీ సిగ్గు చేటైన విషయం ఏమిటంటే ఓ సంచలన మహిళతో మసాజ్ చేయించుకున్న బడా వ్యాపారికి కూడా ఛైర్మన్ పదవి కావాలట?.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వేంకటేశ్వర స్వామి ఆలయంపై పెత్తనం కోసం వీరంతా చేస్తున్న ప్రయత్నాలు వెగటు కలిగిస్తున్నాయి.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడాల్సిన చోట ఏమిటీ గోల?.. రాజకీయాలకు తావులేకుండా ఆధ్యాత్మిక వేత్తలకు, పీఠాధిపతులకు ఎందుకు ఛైర్మన్ పదవి ఇవ్వకూడదు.. అసలు హిందూ మతంపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు?.. అన్యమతస్తుల ప్రార్థనాలయాల విషయంలో ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకుంటుందా? ఈ విషయంలో భక్తులే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment