Thursday, August 23, 2012

అంధ ప్రదేశ్

ముందు చూపులేని కిరణ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం చేస్తోంది.. ప్రభుతవం కనీస అవసరమైన విద్యుత్తు ఇవ్వలేక చేతులు ఎత్తేయడం దారుణం.. ప్రజలు మణులు, మాణిక్యాలు కోరడం లేదు.. వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహావసరాలకు తగినంత విద్యుత్తు కావాలంటున్నారు.. కరెంటు లేకపోతే రైతు పంటలు ఎలా పండిస్తాడు? పారిశ్రామికాభివృద్ది ఎలా సాధ్యం అనే ఇంగితమైనా మన సర్కారుకు లేకపోవడం దారుణం.. విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు పని చేయక ఎంతో మంది కార్మికులకు జీతాలు అందడం లేదు.. కేంద్రంలో ఉన్నది పరాయి ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇంత మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? సొంత పైరవీలు తప్ప రాష్ట్రానికి అవసరమైన ఒక్కపనైనా చేశారా? కనీసం గ్యాస్, బొగ్గు తెచ్చుకోవడం చేత కాకున్నా, రాష్ట్ర తక్షణావసరాల కోసం బయటి నుండి విద్యుత్తు కూడా కొనలేని అసమర్థ పాలకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.. అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి శవాలపై పేలాలు ఏరుకునే చందంగా పని చేస్తున్నాయి.. ప్రభుత్వంతో ఉన్నవారు నిద్ర పోతుంటే, అప్రమత్తం చేయాల్సిన పార్టీలు దొంగలు పడ్డ ఆర్నెళ్లకు ఇప్పడే విషయం తెలిసినట్లు మొరిగేస్తున్నాయి.. రాజకీయ పార్టీలన్నీ కలిసి అంధ్ర ప్రదేశ్ ను అంధ ప్రదేశ్ మార్చేసాయి..

No comments:

Post a Comment