Thursday, August 23, 2012

కోల్ గేట్ స్కామ్ మరకలు కాల్గేట్ పేస్టుతో తోమినా పోవు..

తానే తప్పు చేయలేదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎంత భుకాయించినా దేశ ప్రజలు ఇప్పుడు ఏమాత్రం నమ్మరు.. గతంలో జరిగిన 2జీ, కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాల్లో బకరాలు బలయ్యాయి.. ఇప్పడు ప్రధానే పెద్ద బకరా.. ఎందు కంటే బొగ్గు గనుల శాఖ ఆయన కిందే ఉంది.. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం డీఎంకే రాజావారి 1.76 లక్షల కోట్ల కన్నా పెద్దది..
ఇంత కాలం ప్రధాని ఓ ధృతరాష్ట్రుడు, అసమర్థుడు, సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ అని నమ్ముతూ వచ్చాం.. యూపీఏ ప్రభుత్వంలో కుంభకోణాలతో ప్రమేయం లేకుండా సచ్ఛీలత అనే ముసుగులో దాక్కొంటూ వస్తున్న మన్మోహన్ బట్టలపై ఇప్పుడు కడిగినా పోని బొగ్గు మరకలు అంటాయి.. స్వయాన రాజ్యాంగ బద్దత ఉన్న కాగ్ నివేదిక ఈ కుంభకోణాన్ని నిర్ధారించినా, అసలేమీ జరగనట్లు కాలరెగిరేసుకోవడం కాంగీ రేసు పాలకులకే చెల్లింది.. ప్రతిష్ట దిగజారిన ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే హుందాగా ఉండేది.. కానీ హుందాతనం లేని ఈ కీలుబొమ్మ తాళం చెవి అమ్మోరి చేతిలో ఉంది.. కోల్ గేట్ స్కామ్ మరకలు కాల్గేట్ పేస్టుతో తోమినా పోవు..

No comments:

Post a Comment