Thursday, August 2, 2012

మన దేశాన్ని పాలిస్తున్నది ధృతరాష్ట్ర పాలకులు, కళ్లుండీ చూడలేని కబోదులు.. హస్తిన గాంధారి దేవికి ఈ దేశ ప్రయోజనాలేమైతేనేం తమ కుటుంబం చేతిలో అధికారం ఉంటే చాలు.. అవినీతికి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు చేసినా స్పందన దున్నపోతుపై వానపడ్డత మాత్రమే.. అన్నా హజారే, రాందేవ్ బాబా, ఇతర సామాజిక ఉద్యమకారులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ మొద్దు నిద్ర నటించే ప్రభుత్వం స్పందిస్తుందన్న గ్యారెంటీ లేదు.. ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాల ద్వారానే ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలి.. ప్రభుత్వమే దిగిరావాలన్న ఉద్యమం అత్యాశే.. అన్నా, బాబా తమ దీక్షలు కట్టిపెట్టి దేశ వ్యాప్తంగా పర్యటించి సభల ద్వారా జన జాగరణ కార్యక్రమాలు చేపట్టడే మంచిది..

No comments:

Post a Comment