Friday, August 24, 2012

ఆంధ్ర కేసరినే మరచిన పాలకులు

ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి.. అంతకు ముందు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు.. మద్రాసులో సమైన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో కాల్చరా కాల్చు అని బ్రిటిష్ పోలీసులకు తన చాతిని చూపించిన ధీరుడు.. ఆంధ్ర కేసరిగా ఈ జాతి గౌరవించింది.. దురదృష్టవశాత్తు టంగుటూరి ప్రకాశం పంతులు సోకాల్డ్ గాంధీ పాలక వంశస్తుడు కాదు.. అదే ఆయన చేసి పాపం.. అందుకే కాంగ్రెస్ పాలకులు ఆయన్ని మరచిపోయారు.. ఆంధ్ర కేసరి జన్మదినం రోజున అంధ్రప్రదేశ్ శాసన సభ ఎదుట ఉన్న ప్రకాశం విగ్రహానికి ఏ ఒక్క నాయకుడు నివాళి అర్పించన పాపాన పోలేదు.. సీఎంగారు పదవి కాపాడుకునే ఆరాటంలో ఢిల్లీకి పరుగెడితే, పీసీసీ అధ్యక్షుల వారు అప్పటికే ఢిల్లీలో అధినాయకుల భజన సంకీర్తనావళీలో బిజీగా ఉన్నారు.. నేటి పాలకుల మాదిరిగా పంతులు గారు అవినీతికి పాల్పడి కోటాను కోట్ల ఆస్తులు కూడ బెట్టుకోలేదు.. కడు పేద కుటుంబంలో జన్మించి, న్యాయవాదిగా ఆర్జించిన ఆస్తులన్నీ సమాజ సేవలో కరిగించేశారు.. చివరకు పేదరికంతోనే మరణించారు.. ఇలాంటి మహనీయున్ని మన పాలకులు ఎంత చక్కగా గుర్తు పెట్టుకున్నారో చూశారు కదా?

No comments:

Post a Comment