Monday, August 13, 2012

దయనీయ స్థితి

122 కోట్ల ప్రజలున్న మనది.. ప్రపంచ జనాభాలో రెండో స్థానం మన దేశానిదే.. కానీ క్రీడల్లో మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాం.. లండన్ ఒలింపిక్స్ లో 2 రజత, 4 కాంస్య పతకాలు వెరసి 6 సాధించి మురిసిపోతున్నాం.. మన పొరుగు దేశం 38 స్వర్ణ, 27 రజత, 22 కాంస్య పతకాలు (మొత్తం 87) సాధించింది.. ఒక్కడ చైనా, ఎక్కడ ఇండియా.. మన కన్నా చిన్న దేశాలెన్నో అద్భుత ఫలితాలు సాధించాయి.. ఒలింపిక్స్ లో అవినీతి పోటీలు ఉంటే మన నేతలు కచ్చితంగా గోల్డ్ మెడల్ పొందే వారని కొందరు మిత్రులు హాస్యమాడుతున్నారు..
  క్రీడల్లో సైతం రాజకీయాలు నడిచే మన దేశంలో క్రీడాభివృద్ధిని నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.. క్రికెట్ తప్ప వేరే క్రీడలు తెలియని జనాలు మన దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారని చెబితే ఆశ్చర్యం కలగకమానదు.. ఒకప్పుడు హాకీలో ప్రపం విజేతగా నిలిచిన మన దేశం దశాబ్ధాల క్రితమే ఆ హోదా కోల్పోయింది.. విచిత్రమై విషయం ఏమిటంటే నిన్న మొన్నటి దాకా హాకీ మన జాతీయ క్రీడ అనే భ్రమల్లో ఉన్నాం.. సమాచార హక్కు చట్టం ఓ బాలిక రాసిన లేఖకు సమాధానంగా, అసలు మనకు జాతీయ ఆటే లేదని పీఎంవో చావు కబురు చల్లగా చెప్పింది.. జాతీయ క్రీడా విధానమే లేని మన దేశానికి జాతీయ క్రీడ లేదన్నమాట..  క్రీడల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గే వరకూ మన దేశ దుస్థితి ఇలాగే కొనసాగక తప్పదు..

No comments:

Post a Comment