Thursday, August 9, 2012

ఫోన్లొద్దు.. సబ్బులివ్వండి..

అన్ని విధాల విఫలమైన యూపీఏ సర్కారు మరో జనాకర్షక పథకంతో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తోంది.. దేశంలో 6.52 కోట్ల మంది నిరుపేదలకు మొబైల్ ఫోన్లు, ప్రతి నెలా 200 నిమిషాల టాక్ టైమ్ ఉచితంగా ఇస్తుందట.. ఇందు కోసం కేంద్ర సర్కారుపై ప్రతి ఏటా రూ.8 కోట్ల భారం పడుతుందట.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ల అవసరం ఎంతైనా ఉంది.. సెల్ ఫోన్లు, టారిఫ్ చౌక అయిన తర్వాత ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా అవసరం ఉన్న వారంతా కనెక్షన్ తీసుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితిలో ఉచితంగా ఇచ్చి ప్రభుత్వంపై భారం పెంచుకోవడం అర్థం లేని పని.
మన దేశంలో మరుగు దొడ్లకన్నా మొబైల్ ఫోన్లే అధికమని జైరామ్ రమేష్(?) లాంటి వారు తరచూ వాపోతుంటారు.. అయితే మొబైల్ ఫోన్ల వాడకానికి, మరుగుదొడ్లకు లంకె ఏమిటో నాకు ఇంత మరకూ అర్థం కాని విషయం.. ఎవరి అవసరం వారిది.. పేద వారు మొబైల్ వాడొద్దనే తాలిబాన్ తరహా ఆంక్షలను సమర్థింలేం కానీ, ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇచ్చే చౌకబారు ప్రచార ఎత్తుగడను సమర్థించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు.. ఇందుకు బదులుగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సబ్బులు, యాంటిసెప్టిక్ లోషన్, ఇతరత్రా మందులు ప్రతి నెలా ఉచితంగా ఇస్తే బాగుంటుంది.. ప్రజలందరికీ రక్షిత మంచి నీరు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం కనీసం ఈ పుణ్యకార్యమైనా చేస్తే చాలు..

యూపీఏ1 కాలంలో రైతులకు రూ.60 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది.. అయితే ఈ పథకం రుణాలు చెల్లించే స్థోమత ఉన్న ధనిక రైతులకే ఎక్కవగా ఉపయోగపడింది.. భూమి లేని కౌలు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు.. నిజానికి మన దేశంతో భూమి ఉన్న వారి కన్నా కౌలు రైతులే పెద్ద సంఖ్యలో ఉన్నారు.. ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధి అవసరం.. రాజకీయ నాయకులకు దూర దృష్టి ఉండదెందుకో?..

No comments:

Post a Comment