Wednesday, August 29, 2012

వేపపై పగ ఎందుకు?

వేపను వైద్య చికిత్సలో వాడకుండా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఏసియాన్) నిషేదం విధించడం హాస్యాస్పదంగా ఉంది.. వేప మొక్క సంరక్షణ సాకుతో వాడకూడని జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తోంది.. సింగపూర్లో జరిగిన ఏసియాన్ సాంప్రదాయ ఔషదాలు, ఆరోగ్య అనుబంధ ఆహారాల కార్యచరణ సమితి ఈ నిర్ణయం తీసుకుంది.. భారతీయ ఆయుర్వేద వైద్యంలో వేపకు ఉన్న స్థానం తెలిసిందే.. దురద, మంట, గాయాలు, ఆటలమ్మ, కామెర్ల వ్యాధుల నివారణలో వేపను అద్భుత ఔషదంగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో వాడుతున్నారు..హృద్రోగ వ్యాదులు, మధుమేహం, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధు చికిత్సకు సైతం వేప ఉపయోగపడగలదని పరిశోధనలు చెబుతున్నాయి.. కొన్ని దేశాలు వేపపై పేటెంట్ హక్కు పొందాలని ప్రయత్నించి భంగపడ్డాయి.. భారతీయ సాంప్రదాయ ఔషదాల ఎగుమతిని దెబ్బతీయడమే ఏసియాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.. ఎన్నో ఔషద గుణాలు ఉన్న వేపపై ఇంత ఏసియాన్ ఇంత కుట్ర పూరిత నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వం నోరుమెదపలేదు..

No comments:

Post a Comment