Thursday, August 9, 2012

క్విట్ ఇండియా ఉద్యమానికి 70 ఏళ్లు

క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో ఏడు పదులు (70 ఏళ్లు) నిండాయి. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు తమకు సహకరించినందుకు ఇండియాను వదిలి వెళ్తామని చెప్పిన తెల్లదొరలు మాట మార్చి ఇక్కడే తిష్టవేసేందుకు సిద్ధపడ్డారు. ఇక స్వాతంత్ర్య సమర ఉద్యమానికి ఊపు తేక తప్పదని భారత జాతీయ కాంగ్రెస్ భావించింది.. నేతలంతా చర్చించుకొని ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1942 ఆగస్టు 8న ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మరుసటి రోజు అంటే 1942 ఆగస్టు 9న ముంబైలో సమావేశమై క్విట్ ఇండియా నినాదం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భారతీయులను చెరసాలల్లో పెట్టింది. అయినా ఉద్యమం ఆగలేదు.. ఉప్పెనై ఎగిసింది. చివరకు 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు..


దురదృష్టవశాత్తు దేశ ప్రజలు ఈ మహత్తర ఉద్యమాన్ని మరచిపోయారు.. మీడియాలో కూడా ఈ ఉద్యమానికి సంబంధించిన కథనాలు కనిపించకలేదు.. కొన్ని పత్రికలు ముక్కుబడిగా లోపలి పేజీల్లో చిన్న ప్రస్థావన మాత్రం చేశాయి..

No comments:

Post a Comment