Thursday, April 10, 2014

రేపిస్టులకు ములాయం ప్రోత్సాహం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమాజ్ వాదీ పార్టీని గూండాల పార్టీ అంటారు ఉత్తరాదిన.. యూపీలో గూండారాజ్ అంటే ఏంటో అనుకున్నాను.. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ఏమంటున్నారో విన్నారు కదా?..
మహిళలపై అత్యాచారం చేసే యువకులకు ఉరి శిక్ష వేయడం నేరమట.. కుర్రాళ్లు తప్పులు చేయడం సహజం, అంత మాత్రాన చంపేస్తారా? అని అమాయకంగా ప్రశ్నించాడు ములాయం.. రేప్ చేసిన వారికి ఉరేసే శిక్షను తాము రద్దు చేస్తామని, కేసులు పెట్టిన వారిని కూడా శిక్షిస్తామని సెలవిచ్చేశారు.. ఇటీవల ముంబైలో గత ఏడాది ఓ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం చేసిన ముగ్గురు మృగాళ్లకు న్యాయస్థానం మరణశిక్ష పడాన్ని ఆయన తప్పు పట్టారు.. ములాయం సింగ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగి, మహిళా సంఘాలు ఆయనపై మండి పడుతున్నాయి..

సమాజ్ వాదీ నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు రౌడీలే.. వారిపై హత్యలు, దోపిడీలు, మానభంగం కేసులు చాలా ఉన్నాయట.. తమ కార్యకర్తలకు కూడా ఉరి శిక్ష పడుతుందని ములాయంకు బెంగపట్టుకుందేమో? అందుకే రేపిస్టులకు ఉరి శిక్షను రద్దు చేస్తానంటున్నాడు.. 

No comments:

Post a Comment