Thursday, April 17, 2014

అర్ధం లేని ఆరోపణలు..

బీజేపీపై ఆర్ఎస్ఎస్ పెత్తనం ఎక్కవైందని కొందరు టీడీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.. ఏం చంద్రబాబు పెత్తనంలో బీజేపీ పని చేయాలని కోరుకుంటున్నారా వారు?.. వారు సంఘ్ నుండి స్పూర్తి పొందితే టీడీపీ నేతలకు వచ్చిన నష్టం ఏమిటి?.. తమ అభ్యర్థులను ఎంచుకునే స్వేచ్చ బీజేపీకి లేదా?.. ఆడ లేక మద్దెలపై సాకు చూపినట్లు ఉంది వీరి వ్యవహారం.. బీజేపీ బలహీనంగా ఉందని, తమ పార్టీ ఏదో మా లావుగా ఉందని ఎలా భావిస్తున్నారు? అంత సక్రమంగా ఉంటే మీరెందుకు కాంగ్రెస్ నేతలను అరువు తెచ్చుకుంటున్నారు?.. కేవలం పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకే కదా టీడీపీ అధినేత ఏడుపు? అ సంగతి నేరుగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎందుకట?

No comments:

Post a Comment