Thursday, April 10, 2014

వీరికి బుద్ధి చెప్పండి..

ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియడం లేదు.. నిన్నటి దాకా ఒక పార్టీలో ఉన్నోడు మరో పార్టీలోకి దూకేసి ఎన్నికల బరిలో నిలిచాడు.. పార్టీలు ఎవడికి పడితే వాడికి టికెట్లు ఇచ్చేశాయి.. టికెట్ల రేట్లకు రెక్కలొచ్చేశాయి.. పార్టీలన్నీ బాక్సాఫీసు కలెక్షన్లను లెక్కించుకుంటున్నాయి.. ఇంత కాలం పార్టీ కోసం కష్టపడి పని చేసి టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్నవారిపై నీళ్లు చల్లిన పార్టీలు గోడ దూకిన వాడికే పెద్ద పీట వేసి బరిలోకి దింపాయి.. పార్టీని నమ్ముకున్నోడికి నెత్తిన కుచ్చుటోపీ, చేతికి చిప్పే మిగిలింది..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ నాయకుడు టికెట్ సాధించడమే లక్ష్యంగా ముచ్చటగా మూడు రోజుల్లో మూడు పార్టీలు మారాడు.. ఉభయ ఎర్ర పార్టీలకూ ఫిరాయింపుల బెడద తప్పలేదు.. నాయకులు సిద్దాంతాలకు, విలువలకు, క్రమశిక్షణకు తూట్లు పొడిచేశారు.. ఎన్నికల్లో పోటీ చేయడం.. ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలవడమే ప్రజాసేవా? ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేయలేరా? టికెట్ల కోసం, గెలవడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ నాయకులు రేపు గెలిచాక ఖర్చులు రాబట్టుకునేందుకు ఎంతగా దోపిడీ చేస్తారో ఆలోచించండి..

ఎన్నికల వేళ ఓటర్లు ఇలాంటి జంప్ జిలానీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. పార్టీలతో సంబంధం లేకుండా గోడ దూకిన నేతల కాళ్లిరగొట్టి వాతలు పెట్టండి.. చిత్తుగా ఓడించండి..

No comments:

Post a Comment