Tuesday, April 29, 2014

ఆలోచించి ఓటు వేయండి..

..మీ ఓటుపై భారత దేశం, మన రాష్ట్ర భవిష్యత్తును ఆధారపడి ఉంది..
అవినీతి, కుంభకోణాలు, అసమర్ధ పాలనతో మనం విసిగిపోయాం.. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడిపోతున్నాం.. జనాభాతో పాటు నిరుద్యోగులు, పేదల సంఖ్య పెరిగిపోతోంది.. రూపాయి విలువ పడిపోయి దేశ ఆర్థిక రంగం దిగజారుతుంటే.. దేశ సంపద కొద్ది మంది చేతిలో పడి విదేశీ బ్యాంకులకు తరలిపోయింది.. దేశ అవసరానికి తగిన ఆహారాన్ని అందించలేకపోతున్నాం.. అన్నదాతలను పట్టించుకోకుండా అనాధలను చేస్తున్నాం.. చదువులు ముగించుకొని కాలేజీల నుండి బయటకు వస్తున్న యువతకు సరైన ఉపాది అవకాశాలు చూపించలేక పోతున్నాం.. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను పట్టించరకోవడం మానేశారు..
దేశ భద్రత ప్రమాదంలో పడింది.. శత్రువులు సరిహద్దులు దాటి మన సైనికుల తలలు నరికి తీసుకెళుతున్నా సోయి లేని ప్రభుత్వాల కాలమిది.. దేశ సరిహద్దులనే రక్షించలేనివారు ప్రజలకు రక్షణ కల్పిస్తారమే గ్యారంటీ ఉందా? ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. మహిళలకు రక్షణలేకుండాపోయింది.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదు..

ప్రజల సమస్యలను పరిష్కరించలేని నాయకులు, తమ ప్రయోజనాల కోసం వారిని ఓటు బ్యాంకులుగా మార్చేశారు.. కులం, మతం, వర్గం పేరిట తాయిలాలు చూపిస్తున్నారు.. తమ సొమ్మేం పోయింది అన్నట్లుగా రిజర్వేషన్లు, రుణాల మాఫీ, పెంఛన్లు, స్కాలర్ షిప్స్.. సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు అంటూ ఊరిస్తున్నారు.. మీ ఓట్లకు ధర నిర్ణయించి కొనేస్తున్నారు... ఇలాంటి వారిని నమ్మి ఓటేస్తే మన భవిష్యత్తు ఏమిటి ఆలోచిండి..
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనకు రాజకీయ పార్టీలు పెద్ద పీట వేశాయి.. పార్టీల్లో పదవులతో పాటు ఎన్నికల్లో టికెట్లు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఇచ్చేశాయి.. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారి చేతిలో చిప్ప పెట్టి గెంటేశాయి.. ప్రజాస్వామ్యం ముసుగులో నయా రచరికాలా? ఇదే ప్రజాస్వామ్యం?
నూతన తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది.. తెలంగాణ వచ్చేసింది.. ఇంకా సెంటిమెంట్, ఆయింట్ మెంట్ అంటూ వేళాడటం సరికాదు.. నూతన రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచించండి.. ఉపాధి అవకాశాలు, సాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు మన రాష్ట్రం ముందున్న ప్రధాన సమస్యలు.. వీటి పరిష్కారం కోసం గట్టిగా కృషి చేసే నాయకులు కావాలి.. మనకు కావాలసించి మంచి పాలన.. రెచ్చగొట్టే విధానాలతో సమస్యలు పరిష్కారం కావు.. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే మనం ఈ సమస్యలను అదిగమించగం.. తెలంగాణ అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఆత్మ సాక్షిగా ఆలోచించండి.. బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం మన వంతు కృషి కూడా అవసరం..

కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పడు మనకు కావలసింది దృఢమైన, సమర్ధవంతమైన ప్రభుత్వాలు.. ఇప్పడు మనం సరైన నిర్ణయం తీసుకోకుంటే మరో ఐదేళ్లు విచారిస్తూ గడపాల్సిందే.. ఆలోచించి ఓటు వేయండి.. నిజమైన ప్రజాస్వామ్యానికి మద్దుతు ఇవ్వండి..

No comments:

Post a Comment