Thursday, April 17, 2014

సోనియా కొత్తగా ఏమి చెప్పినట్లు?..

ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో అగ్ర నేతలు వచ్చి ప్రసంగిస్తే తమ విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తారు.. వారి ప్రసంగం ఎలా ఉన్నా స్పూర్తిని పొందడానికి ప్రయత్నిస్తారు.. ప్రతిపక్షాలు విమర్షించినా, సభ సక్సెస్ అని డబ్బా కొట్టుకుంటారు.. కానీ కరీంనగర్ సోనియా గాంధీ కాంగ్రెస్ సభకు భిన్నంగా చెప్పుకోవచ్చు.. ఈ సభలో ఆమె ప్రసంగం చప్పగా, నిస్తేజంగా సాగింది.. వేదికపై నాయకలు మొహాలు చూస్తే తెలుస్తోంది కదూ?.. సభలో కేరింతలు, ఈలలు ఎలా ఉన్నా సోనియా ప్రసంగంలో కొత్తగా చెప్పిందేమీ లేదని నాయకులే ఒప్పుకుంటున్నారు.. సోనియా వచ్చినా, రాహుల్, మన్మోహన్ వచ్చినా కొత్తగా ఒరిగేదేమీ లేదు.. ఆట ఆడే ప్రారంభమయ్యే జనం టీమ్ లీడర్ ను కూడా చూస్తారు.. టీమ్ లీడరే సరిగ్గాలేకపోతే ఆట ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. కానీ ఎవరి టీమ్ లీడర్ వారికి ఇష్టం.. మునిగే నావను వారే కాపాడుకోవాలి కాదా?

No comments:

Post a Comment