Wednesday, April 30, 2014

నేను ఓటేసిన..

మొత్తానికి పొద్దుగాలనే పోయి ఓటేసొచ్చిన.. దేశ ప్రజాస్వామ్యంల భాగమైన..
నాకు ఓటుకు ఎన్ని కష్టాలో.. ఇళ్ల మారిన వెంటనే కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదయ్యాను.. మా చుట్టూ ఎల్.బి.నగర్ నియోజకవర్గం ఉంటే.. మధ్యలో ద్వీపంలా మా కాలనీలను దూరాన ఉన్న యాకుత్ పురా నియోజకవర్గంలో చేర్చారు.. మా అపార్ట్ మెంట్, కాలనీకి బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో ఎవరూ ప్రచారానికి రాలేదు.. వారికి మా ఓట్ల పట్ల పెద్దగా ఆసక్తి లేదేమో.. అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు.. మాకు వచ్చే దిన పత్రికలో ఎల్.బీ.నగర్ నియోజకవర్గ వార్తలే ఉంటాయి మరి.. అభ్యర్థులకే పట్టనప్పుడు ఓటు వేయడం అవసరమా అనే ఆలోచన నాకు కలగలేదు..

తీరా పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో చూస్తే కానీ మా కాలనీ ఓట్లున్న బూత్ లో నా ఓటు లేదు.. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో వెతికితే దూరాన మరో చోట నా ఓటు ఉంది.. మొత్తానికి అక్కడికి వెళ్లి ఓటేసాను.. దేశ హితం కోరేవారికే ఓటేసిన.. ప్రజాస్వామ్యం పట్ల నిబద్దతను చాటుకున్నందుకు సంతోషంగా ఉంది..

No comments:

Post a Comment