Monday, April 7, 2014

వారసత్వాలను తిరస్కరించండి..

మన దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ వారసత్వ రాజకీయం.. దీన్ని కొనసాగించే వారిని ఓడించండి..
ఆరున్నర దశాబ్దాల స్వాతంత్ర్యం మిగిల్చింది ఇదేనా?.. రాజరికాలు పోయాయని ఘనంగా చెప్పుకుంటాం.. కానీ జరుగుతున్నది ఏమిటి?.. ప్రజాస్వామ్యం ముసుగులో కొన్ని వంశాలు, కుటుంబాలు పెత్తనం చేయడాన్ని ఏమనాలి?.. గతంలో ప్రజల ప్రమేయం లేకుండా రాజవంశాలు వారసత్వంగా పాలించేవి.. ఇప్పుడు ప్రజలతో ఓట్లేయించుకొని పాలిస్తున్నాయి.. అంతే తేడా..
తాత పోతే గొంగడి నాదే అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం.. తాతలూ, తండ్రులూ, కొడుకులూ, మనవళ్లూ.. ఇలా కొన్ని కుటుంబాలను భరించాల్సిందేనా?.. ఇతరులు రాజకీయాల్లోకి రాకూడదా?.. పాలించే అర్హత వారికిలేదా?.. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుల మతాలకు అతీతంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది..
అవినీతికి ఆలవాలంగా, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిన ఈ వారసత్వ రాజకీయాలకు ఈ ఎన్నికల్లో ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.. ఇందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం..

ముందు కుటుంబ పార్టీలను నిరభ్యంతరంగా తిరస్కరించే విషయాన్ని పరిశీలిద్దాం.. ప్రజాస్వామ్య స్పూర్తి ఉన్న పార్టీలకే ఓటేద్దాం.. అయితే ఇందులో మీకేమైనా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తే?.. దానికీ పరిష్కారం ఉంది.. ఎన్నికల్లో ఒక కుటుంబం నుండి ఒక సభ్యున్నే గెలిపిద్దాం.. ఒకే కుటుంబం నుండి వేర్వేరు పార్టీల్లో అభ్యర్థులు ఉన్నా, ఒకే పార్టీలో వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నా ఒక కన్నేసి ఉంచండి.. అందులో ఎవరు ఉత్తమమో వారికే ఓటేయడండి.. ఏ మంచి పనైనా అయినా ప్రారంభమయ్యేది ఒక అడుగుతోనే.. ఈ తొలి అడుగు మనమే ఎందుకు వేయకూడదు.. ఆలోచించండి..

No comments:

Post a Comment