Tuesday, April 29, 2014

పండిట్ల సాక్షిగా ఈ మాటలనగలరా?

నరేంద్ర మోదీకి ఓటేసేవాళ్లంతా సముద్రంలో మునగాలట.. కేంద్ర మంత్రినేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నాడు..
అంతే కాదు.. మోదీకి ఓటేస్తే భారత దేశం మత రాజ్యంగా మారుతుందని, కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండబోదని హెచ్చరించాడు.. మతవాదం కశ్మీర్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని సుద్దులు చెబుతున్నాడు ఫరూఖ్ అబ్దుల్లా..
అరె.. మూర్ఖ్ ఫరూఖ్! ఈ మాటలనే అర్హత ఉందా నీకు?.. కశ్మీర్లో మతతత్వ బీజాలు పడింది నీ కుటుంబ పాలనలోనే కదా?.. నీ తండ్రి షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందిన ఆర్టికల్ 370 కారణంగానే వేర్పాటు తలెత్తింది కదా?.. నీవు సీఎంగా ఉన్నప్పుడు పండిట్లపై అత్యాచారాలు, హత్యకాండ కొనసాగించి.. వారి ఇండ్లు, ఆస్తిపాస్తులు లాక్కొని కశ్మీర్ లోయ నుండి తరిమేయలేదా?.. ఇప్పుడు సీఎంగా ఉన్న నీ కొడుకు ఒమర్ అబ్దుల్లా చేతగానితనంతో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగడం తెలియనిది ఎవరికి?.

ఫరూఖ్ అబ్దుల్లా తన మొహం అద్దంలో ఒకసారి చూసుకొని చెప్పాలి.. మీ కుటుంబం కన్నా గొప్ప మతవాదులు, వేర్పాటు వాదులు, దేశ ద్రోహులు ఇంకెవరున్నారని.. కశ్మీరీ సంస్కృతి, చరిత్రకు అసలైన వారసులైన పండిట్ల కళ్లలోకి సూటిగా చెప్పండి మీరు లౌకికవాదులేనా? ఆ ధైర్యం మీకు ఉందా?

No comments:

Post a Comment