Monday, April 14, 2014

కేజ్రీవాల్ పబ్లిసిటే ఎక్కువట..

ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఏ పని చేసిన ప్రచారం కోసమే అని అందరికీ తెలుసు.. ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేసినా.. ఆటోలో, మెట్రోలో ప్రయాణం చేసినా.. మఫ్లర్ మీదుగా టోపీ పెట్టినా.. గంగానదిలో అర్ధ నగ్నంగా స్నానం చేసినా.. చివరకు తనను కొట్టిన వ్యక్తుల ఇంటికి వెళ్లి పరామర్శించినా మీడియా కెమెరాలు ఉండాల్సిందే..
అసలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకన్నా కేజ్రీవాలే టీవీల్లో ఎక్కవగా కనిపిస్తున్నారట.. ఒక అధ్యయనం ప్రకారం ప్రైమ్ టైమ్ టీవీ న్యూస్ కేజ్రీవాల్ కవరేజే ఎక్కువగా ఉంటోంది.. ఐదు టాప్ న్యూస్ ఛానెళ్లను అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారట..

మరి మీడియా తనకు కవరేజీ సరిగ్గా ఇవ్వడం లేదని, మోడీకి అమ్ముడు పోయిందని ఎందుకు కేజ్రీవాల్ ఆరోపిస్తున్నట్లు?.. తాను అధికారంలోకి వస్తే మీడియా వారిని జైలుకు పంపుతానని ఎందుకు బెదిరించినట్లు?.. అదీ ఒకరకమైన పబ్లిసిటీ జిమ్మిక్కే సుమా?.. ఎంతైనా గోరంత పనికి కొండంత పబ్లిసిటీ పొందడం కేజ్రీవాల్ కే సాధ్యం కదూ..  ఆధారాలు లేకుండా ప్రత్యర్ధులపై ఆరోపణలు చేయడం, ఆధారాలు చూపమంటే మీరే విచారించుకోండి అని గడుసుగా జవాబు చెప్పడంలోనూ సిద్ద హస్తుడే.. ఎంతైనా మీడియా పెంచి పోషిస్తున్న నాయకుడు కదా?

No comments:

Post a Comment