Tuesday, March 1, 2016

సైనికులను కించపరచిన మేతావి..

భారత సైన్యంలో చేరుతున్న వారంతా దేశంపై ప్రేమ, భక్తితో కాదు.. కేవలం పేదరికం కారణంగానే చేరుతున్నారు..ఈ మాటలు అన్నది ఏ లఫూట్ గాడో అయ్యుంటే వాడు పిచ్చి ముదిరిన వోడో, లేక పనికి మాలిన భావజాలం వంట పట్టిన పెంట మేతావో అని పట్టించుకోకుండా సరిపెట్టుకోవచ్చు.. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీడియా సలహాదారు.. పేరు దినేష్ అమిన్ మట్టు..
దినేష్ మట్టు మొదటి నుండి వివాదాస్పదుడే.. ఈ ఏడాది జనవరి 16న గణతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు, మారణ హోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఐసిస్ ప్రేరిత ఉగ్రవాదులను బెంగళూరు, మంగళూరు, తంకూరు నగరాల్లో ఎన్ఐఏ అరెస్టు చేసింది.. ఈ అరెస్టులు ఒక మతంపై జరుగుతున్న దాడులని మొరిగాడీ మేతావి.. స్వామి వివేకానంద జీవితం స్పూర్తి దాయకం కాదంటూ గతంలో ఓ పత్రికలో రాశాడీ మిడిమిడి జ్ఞాని.. దేశ ప్రజల మనోభావాలను కించపరుస్తున్న ఇలాంటి మతి తప్పిన వెధవలను ఇలాగే భరించాల్సిందేనా?

ఇలాంటి అరాచకవాదులను మీడియా సలహాదారుగా నియమించుకున్నందుకు సిద్దరామయ్యపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందనుకోవడం శుద్ద దండగ.. ఎందుకంటే అధికారం కోల్పోయాక విచక్షణ కోల్పోయి, వారు చేస్తున్న పనులేమిటో దేశ ప్రజలంతా చూస్తున్నారు కదా..

No comments:

Post a Comment