Wednesday, March 9, 2016

తెలంగాణ, మహారాష్ట్రల మధ్య చారిత్రిక ఒప్పందం

గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన చారిత్రిక ఒప్పందం నిజంగా దార్శనికం. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎంతో విజ్ఞ‌త‌, ముందుచూపు ప్రదర్శించారు..  ఈ ఒప్పందం అమలైతే తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిత్యం కరువుకాటకాలతో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుంది.. సాగునీరు, తాగునీటికి కొరత ఉండదు..
నిజానికి ఈ పని ఎప్పుడో జరగాల్సింది.. కానీ గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల విషయంలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఉభయులకూ తీరని నష్టం కలిగించాయి.. ఇచ్చి పుచ్చుకునే, సామరస్య ధోరణి ఉంటేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది..

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభ్యంతరాల కారణంగా నష్టపోతున్నది రైతాంగమే..  ఇదే తరహా ఒప్పందాలు రాజకీయాలకు అతీతంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కూడా కుదిరితే తెలుగు ప్రజలందరికీ మేలు జరుగుతుంది..

No comments:

Post a Comment