Tuesday, March 22, 2016

ఈళ్లని ఎర్రగడ్డ పంపాల్సిందే..


కాంగ్రెస్ నాయకులకు అసహనంతో పిచ్చి పట్టినట్లుంది.. వారికి దేశభక్తులకు, దేశద్రోహులకు తేడా తెలియడం లేదు.. JNU విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చాడు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. దేశ స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్.. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుకు మద్దతు తెలిపిన నీచుడు కన్నయ్య.. ఇద్దరికీ ఎక్కడైనా పోలిక ఉందా?..
వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలు దేశ ప్రజలను విడదీస్తాయట.. మరో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ.. కాంగ్రెస్ పార్టీని నకిలీ గాంధీలు నడిపిస్తున్నారు కాబట్టి సరిపోయింది.. మహాత్మా గాంధీ బతికే ఉంటే ఈ మాటలకు ఆయన గుండె పగిలేది.. అరె మనిషే కాని తివారీ నీవు ఈ దేశంలో ఉండే అర్హత ఉందా?..
దేశద్రోహ నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నయ్యను తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు రాహుల్ గాంధీ.. భాజపాపై పోరాటానికి ఇతగాడి మద్దతు తీసుకుంటాడట పప్పూ.. కాంబినేషన్ అదిరింది కదూ.. తాత సంపాదించిన సొమ్మును మనవడు విచ్చల విడిగా ఖర్చు చేసినట్లు, మత పెద్దలు తెచ్చిన స్వాతంత్ర్యాన్ని దేశ ద్రోహులకు తాకట్టు పెట్టడం అంటే ఇదే..

ఈ నాయకులను ఇలాగే వదిలేస్తే ప్రమాదమే.. మన ఎర్రగడ్డకు తీసుకువచ్చి చికిత్స చేయాల్సిందే..

No comments:

Post a Comment