Saturday, March 26, 2016

వందేమాతరం..

వందేమాతరం..
బంకించంద్ర చ‌టోపాధ్యాయ రాసిన ఆనంద మ‌ఠంలోని వందేమాత‌ర గీతం స్వాతంత్ర్యోద్యమ‌ స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉర్రూత‌లూగించింది.. వందేమాత‌రం అంటే తెలుగులో 'త‌ల్లీ నీకు వంద‌నం' అని అర్థం..  ఉర్దూలో 'మాద్రె వ‌త‌న్' అంటారు.. భార‌త మాత స్వ‌రూపం రూపుదిద్దుకున్న‌ది ఈ గీతం నుండే.. దేశాన్ని మాతృ-పితృ రూపంలో ఆరాధించడం మ‌న దేశంలోనే కాదు.. ప్ర‌తి దేశంలోనూ ఈ ఆచారం ఉంది..
భార‌త్ మాతాకీ జై నినాదం.. వందేమాత‌ర గీతాలు మ‌న దేశ ప్ర‌జ‌ల్లో జాతీయ భావాన్ని పెంపొందించాయి.. కానీ ఇది త‌ప్పు అని  ఇప్ప‌డు  కొంద‌రు మేతావులు రాగాలు తీస్తున్నారు..  ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ఒక‌డుగు ముందుకు వేసి ఇది  ఇస్లాంకి విరుద్ద‌మ‌ని వాదిస్తాడు.. ఈ సంద‌ర్భంగా ఞ‌క విష‌యాన్ని గుర్తుంచుకోవాలి..
1997లో స్వాతంత్ర్య స్వ‌ర్ణోత్స‌వాలు జ‌రుపుకుంటున్న వేళ ఏ.ఆర్ ర‌హ‌మాన్ స్వ‌ర ప‌ర‌చిన వందేమాత‌రం ఆల్బం ఆసేతు హిమాచ‌లం దేశ ప్ర‌జ‌లంద‌రినీ ఉర్రూత లూగించింది.. అందులో ఆయ‌న 'మా తుఝే స‌లాం'.. అంటూ ఎంతో ఉధ్వేగంగా భార‌త‌మాత‌ను కీర్తించారు.. ఇందుకు ఈ ఓవైసీల‌తో స‌హా ముస్లిం ప్ర‌ముఖులెవ‌రూ ఎవ‌రూ అభ్యంతం వ్య‌క్తం చేయ‌లేదు.. మ‌రి ఆనాడు లేని అభ్యంత‌రాలు, అస‌హ‌నాలు ఇప్పుడు కొత్త‌గా ఎందుకు వ‌స్తున్నాయి.. దేశ ప్ర‌జ‌లంతా ఈ కుట్ర‌ల‌ను గ్ర‌హించాలి.. దేశాన్ని మ‌రోమారు కుల‌, మ‌తాల పేరిట చీల్చాల‌ని  చూస్తున్న ద్రోహుల‌కు చెక్ పెట్టాలి.. గ‌ర్వంగా ఆల‌పించండి వందే మాత‌రం.. మా తుఝే స‌లాం.. భార‌త మాతాకీ జై..

No comments:

Post a Comment