Thursday, March 10, 2016

మాయ రోగి ప్రగల్భాలు..

భారత దేశాన్ని ధ్వంసం చేస్తాం.. పాకిస్తాన్ జిందాబాద్.. కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలి.. అంటూ వేర్పాటు వాదులతో గొంతు కలిపి నినాదాలు చేసిన కన్నింగ్ కన్నయ్య ఇప్పుడు ఏకంగా వీర జవాన్లపై నోరు పారేసుకున్నాడు.. భారత సైన్యం కాశ్మీర్ మహిళలపై అత్యాచారాలు చేస్తోందట.. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పుతానని ఊగిపోతున్నాడీ హిస్టీరియా పేషంట్..
ఈ మాయరోగికి కాశ్మీర్ లో పాచినోళ్ల ఆజాదీ జీహాదీ గాళ్లు చేసే అకృత్యాలు తెలియవా?.. వేలాది మంది కశ్మీర్ పండిట్లపై అత్యాచారాలు చేసి, వారి ఆస్తులను దోచుకొని లోయ తరిమేసిన సంగతి తెలియదా?.. అలాంటి వేర్పాటువాదుల అంటకాగుతున్న కన్నయ్యకు మద్దతు ఇస్తున్నందు వామపక్షాలు సిగ్గుపడాలి..
దేశ సరిహద్దులను కాపాడేందుకు రాత్రింబవళ్లు కాపాలా కాస్తూ నిత్యం ఉగ్రవాదులతో తలపడుతూ ప్రాణ త్యాగాలు చేస్తున్న వీర జవాన్లపై నోరు పారేసుకున్న ఇలాంటి వాళ్లను ప్రజలు ఎలా భరిస్తున్నారు?.. అఫ్జల్ గురు జోహార్లర్పిస్తూ, వీర జవాన్లపై నిందలు వేస్తున్న కన్నింగ్ కన్నయ్య లాంటి చీడ పురుగులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలను ముందు ధ్వసం చేయాలి..

కొసమెరుపు ఏమిటంటే ఖైదీ కన్నయ్య తమకు ప్రచారం చేసి పెడతాడని వామపక్షాలు బెయిల్ ఇప్పించాయి.. అలాంటిదేమీ లేదని చెబుతున్నాడు ఈ కన్నింగ్.. అందుకే అన్నారు ఎవరు తీసిన గోతిలో వారే పడతారని..

No comments:

Post a Comment