Tuesday, March 29, 2016

జీతాలు పెంచేసుకున్నారు..

 
మొత్తానికి మన 'ప్రజాసేవకులు' ప్రజలతో సంబంధం లేకుండా తమ తమ జీతాలు తాము పెంచేసుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేతనాలు Rs 95,000 నుండి ఏకంగా Rs 2,50,000లకు చేరాయి.. నిజానికి వారికి ఇప్పుడున్న జీతాలే ఎక్కువ.. ఇంకా చెప్పాలంటే ఇవి కూడా తగాల్సిందే..
ప్రజలు వీరిని తమ ప్రతినిధులుగా చట్ట సభలకు పంపింది తమ సమస్యలను పరిష్కరించడానికి.. ఇది ఉద్యోగం కాదు.. వీరు తీసుకోవాల్సింది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమే..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారా అన్న విషయాన్ని నేను చర్చించ దలచుకోలేదు.. అది ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి.. వారిని ఎన్నుకున్న ప్రజలు నిర్ణయించాలి..
మన ప్రజా ప్రతినిధులకు చట్ట బద్దంగా వచ్చే జీత భత్యాలకు తోడుగా 'చాలా' మందికి 'ఆమ్యామ్యాలు' ఉంటాయన్నది బహిరంగ రహస్యం.. జీతాలు భారీగా పెంచినందున వాటిని వదులుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది..
మన సమాజంలో ఎంతోమంది శ్రామికులు, కర్షకులు, చిరుద్యోగులు చాలీ చాలని జీతాలు, సంపాదనతో బతుకు బండి ఈడుస్తున్నారు.. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేని రోజు ఏనాడైనా ఉందా?.. వారి సంక్షేమం గురుంచి ఉపన్యాసాలు తప్ప చేసిందేమిటి?..
ఆలోచించండి.. ఆత్మ విమర్శ చేసుకోండి.. ఆ తర్వాతే జీతాలు పెంచుకోండి.. (క్రాంతి దేవ్ మిత్ర)

No comments:

Post a Comment