Wednesday, March 9, 2016

తెలంగాణ ముద్దుబిడ్డ చొర‌వ‌

గోదావరి జలాల ఒప్పందంలో తెర వెనుక సూత్రధారి పాత్రను ఏ విధంగా కూడా విస్మరించలేం..  తెలంగాణకు చాలా కీలకమైన ఈ అంశంపై ఇద్దరు సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్ లను ఒప్పించడంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సైతం తనవంతు సహకారం అందించారు..  తెలంగాణకు గోదావరి జలాల అవసరం తెలిసిన ఈ ప్రాంత ముద్దుబిడ్డగా, చారిత్రక ఒప్పందానికి మహారాష్ట్ర సర్కారును ఒప్పించారు విద్యాసాగర్ రావు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ రైతాంగానికి ఎంతో ఉ
పకారం చేశారు.

No comments:

Post a Comment