Friday, March 11, 2016

కుచ్చు టోపీ పెట్టి పారిపోయిన మల్లయ్య

తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన జి.బాలన్ అనే ఇండియన్ బ్యాంకు నుండి లోన్ తీసుకున్నాడు.. సకాలంలో తిరిగి చెల్లించలేదంటూ బ్యాంకర్లు, పోలీసులు అతనిపై దాడి చేసి కొట్టారు.. బాలన్ ట్రాక్టర్ పట్టుకెళ్లారు.. ఇంతకీ బాలన్ బ్యాంకుకు బాకీ పడింది ఎంతో తెలుసా? కేవలం ₹ 1.3 లక్ష మాత్రమే..
విజయ్ మాల్యా అనే విలాస పురుషుడు మద్యం, విమానయానం వ్యాపారాల పేరిట పదుల సంఖ్యలో బ్యాంకుల నుండి ₹ 9 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు.. విచ్ఛల విడిగా ఖర్చుచేసి తన దగ్గరేముంది బూడిద అంటూ చేతులెత్తేశాడు.. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే లోపు దేశం వదిలి పారిపోయాడు..
మన దేశంలో రైతులకు, చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సవాలక్ష కండిషన్లు పెట్టి తిప్పుకుంటాయి.. సకాలంలో చెల్లించకపోతే బందిపోట్లలా ఇళ్ల మీద పడి దోచుకుంటాయి.. కానీ జనం పొమ్ము విలాసాలకు ఖర్చుచేసే ఇలాంటి పెద్ద మనుషులకు మాత్రం వెంటపడీ మరీ లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు..

పాపం బ్యాంకులు.. చేసుకున్నవారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో..

No comments:

Post a Comment