Tuesday, March 15, 2016

లోపిస్తున్న దేశ భక్తి భావన..

జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి.. లంకా విజయం తర్వాత ఇక్కడే ఉండిపోదామని లక్ష్మణుడు ప్రతిపాదించడంతో, శ్రీరాముడు తమ్మునికి చెప్పిన మాట ఇది.. కన్న తల్లి,, ఆ తల్లిని కన్న నేల స్వర్గంకన్నా గొప్పది అని అర్థం..
తమ దేశాన్ని మాతృ లేదా పితృ భావనతో చూడటం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న సాంప్రదాయం.. దేశాన్ని తల్లిగా భావించడం, భారత మాతగా ఆరాధించడాన్ని ఎలా తప్పు పట్టగలం?.. విదేశీ పాలకులు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో వందేమాతరం.. భారత మాతాజీ జై..’  నినాదాలు దేశ ప్రజలను ఐక్యం చేశాయి..
ఈ రోజున కొన్ని శక్తులు ఈ దేశం ఒకటి కాదనే వాదన ప్రారంభించాయి.. భారత దేశ అస్థిత్వాన్నే నిరాకరిస్తున్నాయి.. దేశ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఈ కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
పీక మీద కత్తి పెట్టినా భారతమాతాకీ జై అననని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేయడంలో ఆశ్చర్యం ఏముంది.. దేశంపై ప్రేమ మనసులో ఉండాలి.. ఆ ప్రేమ ఉన్నవారు ఎలాగైనా వ్యక్తం చేస్తారు..
బ్రిటిష్ వారు వెళ్లి పోయిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యతిరేకించాడు.. అతనికి అండగా నిలిచిన వారు రజాకార్లు.. రజాకార్ల పార్టీయే ఎంఐఎం.. ఢిల్లీలో ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికాడు వారి నాయకుడు కాసిం రజ్వీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రజ్వీ జైలుపాలై, విడుదలయ్యాక పాకిస్తాన్ పారిపోయాడు.. ఇంతటి ఘన వారసత్వ చరిత్ర ఉన్న ఎంఐఎం పార్టీవారు భారత్ మాతాజీ జై అంటే ఆశ్యర్యపోవాలి.. నిరాకరిస్తే ఆశ్యర్యపోవాల్సిన అవసరం ఏమిటి?..

No comments:

Post a Comment