Saturday, August 9, 2014

డుమ్మా రత్నకీ జై..

పిల్లలు స్కూల్ ఎగ్గొట్టాలంటే ఏం చేస్తారు?.. జ్వరమో, కడుపు నొప్పో లేక తాతగారికి బాగాలేదనో (రిస్క్ లేదు.. చాలా మంది తాతలు అప్పటికే పోయి ఉంటారు) హెడ్మాస్టర్కు లెటర్ రాస్తారు.. బెనిఫిట్ అఫ్ డౌట్ కింద ఆయన చిద్విలాసంగా నవ్వేస్తాసి సర్లే అనేస్తాడు.. రాజ్యసభ ఛైర్మన్ గారికీ అదే పరిస్థితి ఎదురై ఉంటుంది..
పాపం క్రికెట్ గాడ్ కి (కొందరికి దేవుడట) పార్లమెంట్ కు వచ్చే తీరిక లేదు.. 2012 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.. కానీ ఈ మూడేళ్లలో కేవలం మూడు సార్లు మాత్రమే పార్లమెంటుకు హాజరయ్యారు.. అందులో ఒక రోజు బహుషా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఉండొచ్చు.. ఆయన కన్నా సినీ తార రేఖ నయమట.. ఆమె ఈ మూడేళ్లలో తీరిక చేసుకొని ఏడు రోజులు పార్లమెంటుకు రాగలలిగింది..
ఇంతకీ పార్లమెంట్ గైర్హాజరీకి సచిన్ టెండూల్కర్ చూపిన కారణం ఏమిటో తెలుసా? తన అన్నగారి ఆరోగ్యం బాగోలేదట.. ఇది వాస్తవమే.. కానీ తాను దగ్గర ఉండి సేవలు చేయాల్సిన అవసరం పడిందట.. చెవిలో పువ్వెట్టింగ్ కాదూ?..
ఈ మధ్యనే సచిన్ చాలా తీరిక చేసుకొని బెజవాడలో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిపోయాడు.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో ఈవెంట్లకూ హాజరైన సందర్భాలు కనిపించాయి.. కానీ పార్లమెంట్కు వచ్చే తీరిక మాత్రం దొరకదు పాపం.. (పార్లమెంట్ హాజరీకి లభించే దినసరి భత్యం కన్నా ఇతరత్రా గిట్టుబాట్లే అధికం అని గిట్టనివారు చెవులు కొరుక్కుంటున్నారు)

రాజకీయాల పట్ల ఆసక్తి లేకుండా సమాజ సేవ చేస్తున్న ప్రముఖులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే విచక్షణాధికారాన్ని మన రాజ్యాంగం  రాష్ట్రపతికి కట్టబెట్టింది.. కానీ ప్రభుత్వం సిఫార్సు చేసే వారికే సీట్లు దక్కుతాయి అది వేరే విషయం.. ఎవరైనా సెటబ్రిటీలను రాజ్యసభకు పంపే ముందు వారు ఈ పదవికి ఎంత వరకు న్యాయం చేయగలరు అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.. జనాల్లో క్రేజీ ఉన్న ప్లేయరో, నటులకో రాజ్యసభ సభ్యత్వాలు, భారత రత్నలు ఇచ్చి వారి అభిమానుల ఓట్లు రాబట్టుకోవచ్చే దుర్భుద్ది పాలకులకు ఉంటే వ్యవహారం ఇలాగే ఉంటుంది..

No comments:

Post a Comment