Saturday, August 16, 2014

స్పూర్తినిచ్చిన ప్రసంగం..

ప్రధానమంత్రిని కాదు.. ప్రధాన సేవకున్ని అని ప్రకటించారు నరేంద్ర మోదీ.. రెండు దశాబ్దాల తర్వాత బుల్లెట్ ఫ్రూప్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి, జాతినుద్దించి ప్రసంగించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు మోదీ.. ప్రసంగ పాఠంతో పని చేకుండా అనర్గళంగా సాగిన ఈ ప్రసంగం దేశ ప్రజలకు కదిలించడమే కాదు విమర్శలకు తావులేకుండా చేసింది.. పేదరికంపై యుద్దం ప్రకటించారు మన ప్రధాని.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా 125 కోట్ల మంది ప్రజలు చేయి చేయి కలిపి పని దేశం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.. మన నైపుణ్యం, ప్రతిభా పాటవాలతో స్కిల్ ఇండియాను రూపొందిద్దామన్నారు..  కాలం చెల్లిన ప్రణాళికా సంఘం అవసరం లేదని, అభివృద్ధిలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేలా సరికొత్త సంస్థను తీసుకువస్తున్నాట్లు మోదీ ప్రకటించారు.. తమ పార్టీకి పూర్తి బలం ఉన్నా మెజారిటీ, మైనారిటీతో సంబంధం లేకుండా ఏకాభిప్రాయంతో పని చేస్తామని తెలిపారాయన.. గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాలు చూశాం..  కానీ ఇంతటి స్పూర్తిదాయకమైన ప్రసంగాన్ని విన్నామా?.. 

No comments:

Post a Comment