Friday, August 15, 2014

15 ఆగస్టు 1947 నాటికి..

15 ఆగస్టు 1947లో బ్రిటిష్ పాలన అంతమై భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం.. కానీ నిజానికి ఆ సమయానికి మన హైదరాబాద్ సంస్థానంతో సహా దేశంలోని 50 శాతానికి పైగా భూభాగాలు స్వాతంత్ర్య వేడుకలకు దూరంగా ఉన్నాయి..
దాదాపు మూడో వంతు భూభాగాన్ని బ్రిటిష్ వారు విడదీసి పాకిస్తాన్ కుంపటి పెట్టారు.. 1947 ప్రాంతంలో దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.. వీరికి భారత్, పాకిస్తాన్లలో ఎందులో అయినా చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చంటూ బ్రిటిష్ వారు స్వేచ్ఛ ఇచ్చారు..  ఈ సంస్థానాలలోని ప్రజలంతా భారత్లో కలవాలని బలంగా కోరుకున్నారు.. దేశంలోనే అతి పెద్ద సంస్థానమైన హైదరాబాద్లో ఆర్యసమాజీయులు, స్టేట్ కాంగ్రెస్ వారు నిజాం ఆంక్షలను ధిక్కరించి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు.. కఠిన శిక్షలకు గురయ్యారు..
ఇలాంటి తరుణంలో మన మొదటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చాక చక్యంగా పావులు కదిపి అన్ని సంస్థానాలు కూడా భారత దేశంలో విలీనం అయ్యేలా ఒప్పించారు.. కానీ  హైదరాబాద్, కాశ్మీర్, జునాఘడ్, తిరువాన్కూర్ సంస్థానాలు ఎటూ తేల్చలేదు.. పటేల్ రంగంలోకి దిగి హైదరాబాద్, జునాఘడ్, తిరువాన్కూరు సంస్థానాలను సామ, దాన, బేధ, దండోపాయాలతో దారిలోకి తెచ్చారు.. కాశ్మీర్ అంశాన్ని ప్రధాని నెహ్రూ డీల్ చేసిన కారణంగా నేటికీ ఆ సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..

ఈ రోజున మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ సమైక్యతతో ఉందంటే అది ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయి పటేల్ కారణంగానే.. ఆ మహనీయున్ని స్మరించుకోవడం మన విధి..

No comments:

Post a Comment