Sunday, August 17, 2014

ఇలాంటి వారినేం చేయాలి?

మనకు జన్మనిచ్చిన తల్లి ఎంత ముఖ్యమో.. మన జన్మించిన భూమి కూడా అంతే.. భూమిని తల్లిగా పూజిస్తాం.. భూమాత అంటాం.. అలాగే మన జన్మభూమి కూడా..
ప్రతి దేశస్తుడు తాను పుట్టిన దేశాన్ని, మాతృభూమిగా, పితృభూమిగా ఆరాధిస్తాడు.. భారతీయులమంతా మన దేశాన్ని భారత మాతగా పిలుచుకుంటాం.. ఆరాధిస్తాం.. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడతాం.. దేశభక్తి కులం, మతం, ప్రాంతం, భాష అడ్డు రాదు.. మన దేశ చిత్రపటాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించి తీరాల్సిందే.. ఈ దేశంలో పుట్టి,, ఇక్కడి తిండి తిటూ, గాలి పీలుస్తూ, ఇక్కడే పెరుగుతున్నందుకు దేశానికి ఎంతో రుణపడి ఉండాలి.. ఈ దేశాన్ని అగౌరవపరిస్తే, మన మతృమూర్తిని అగౌరవ పరచుకున్నట్లే..

ఖమ్మం జిల్లాల్లో మతోన్మాదం తలకెక్కిన ఓ మూర్ఖపు ప్రధానోపాధ్యాయుడు వ్యవహారం ఎలా ఉందో ఈ వార్తను చూడండి.. భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అసలు ఇలాంటి వెధవలకు ఉపాధ్యాయ వృత్తిని ఇచ్చిందెవరు? అందునా ప్రధానోపాధ్యాయ ఉన్నతిని ఇచ్చిందెవరు? వారిని అనాలి ముందు.. ఇలాంటి దౌర్భాగ్య మనస్తత్వం ఉన్నవారిని ముందు ఉద్యోగం నుండి తొలగించాలి.. దేశాన్ని అగౌరవపరచినందుకు కఠినంగా శిక్షించాలి..
ఏ మతం కూడా దేశాన్ని అగౌరవపరచమని చెప్పదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..

No comments:

Post a Comment