Tuesday, August 19, 2014

పాకిస్తాన్ కు గుణపాఠం తప్పదు..

శత్రువును సామ దాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకోవాలంటారు.. పాకిస్తాన్ పుట్టిందే భారత దేశ వ్యతిరేకతతో.. నిరంతరం విషం చిమ్మనిదే దానికి మనుగడ లేదు.. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది పాకిస్తాన్..ఎవడైనా పాక్ పాలకుడు సద్భుద్ధితో భారత్ కు స్నేహ హస్తం అందిస్తే ఐఎస్ఐ, సైన్యం ఊరుకోదు..
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం వేడుకకు పాకిస్తాన్ సహా సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు నరేంద్ర మోదీ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు సందేశాన్ని ఇచ్చారు.. పాకిస్తాన్ ఎప్పటిలాగే గుంటనక్క లా ప్రవర్తించింది.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చాడు.. నరేంద్ర మోదీతో కరచాలనం చేశాడు.. ఆ తర్వాత జరిగిన భేటీలో పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలు మారాలని స్పష్టంగా నవాజ్ కు చెప్పారు మోదీ..
కుక్క తోక వంకర అంటారు.. అందుకే పాకిస్తాన్ తన పద్దతులు మార్చుకోవడం లేదు.. సరిహద్దుల్లో యధావిధిగా కాల్పులు జరుపుతూనే ఉంది.. ఇటీవల కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికనే ఇచ్చారు.. తాజాగా భారత్ లోని పాకిస్తాన్ హై కమిషనర్ కాశ్మీర్ వేర్పాటు వాద ఉగ్రవాదులను పిలిపించుకొని మాట్లాడారు.. దీంతో ఈ నెల 25 తేదీన ఇస్లామాబాద్లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసుకుంది భారత్..
అటల్జీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా నవాజ్ షరీఫ్, పాక్ సైన్యం ఇలాగే తమ దుష్టబుద్దిని ప్రదర్శించాయి.. బస్సుయాత్ర సందేశాన్ని నీరుగార్చి కార్గిల్ కయ్యానికి దిగాయి.. వెంటేనే తేరుకున్న భారత్ గట్టి బుద్ది చెప్పింది.. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నది నరేంద్ర మోదీ..
పాకిస్తాన్ బుద్ది మారేందుకు అన్ని అవకాశాలు ఇచ్చారు మోదీ.. మరికొన్ని అవకాశాలు ఇస్తారేమో?.. దారికి రాకపోతే మాత్రం కఠినంగా వ్యవహరించి ఆ దేశానికి గుణపాఠం చెప్పడం ఖాయం..

No comments:

Post a Comment