Wednesday, August 6, 2014

బాబు టేస్ట్ మారింది..

చంద్రబాబు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక రంగ వికాసంలో భాగంగా హైదరాబాద్ బిర్యానీకి దాదాపు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.. హైదరాబాద్ బిర్యానీ రుచి చూడండంటూ సందర్భం వచ్చినప్పుడల్లా నగరానికి వచ్చే ప్రముఖులకు సూచించేవారు.. పాపం.. ఇప్పుడు కాలం మారింది కదా.. హైదరాబాద్ బిర్యానీ తెలంగాణ రాష్ట్రానిదాయే.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఫుడ్ బ్రాండ్ ఎంచుకున్నారు.. రాగిసంకటి, నాటుకోడి పులుసుకు ప్రాచుర్యం ఇస్తారట.. రాయలసీమ వాసులకు ఎంతో ఇష్టమైన ఆహారం ఇది.. హైదరాబాద్ నగరంలో సైతం క్రితుంగ, రాయలసీమ రుచులు తదితర రెస్టారెంట్లలో ఇవి బాగా సేల్ అవుతున్నాయి.. బాబు గారూ సంయుక్త ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడే రాగిసంకటి, నాటుకోడి పులుసును ప్రమోట్ చేసి ఉంటే?.. ఈపాటికి దీనికి అంతర్జాతీయ ప్రాచుర్యం దక్కేసేదే కదా?..

No comments:

Post a Comment